విశాఖ: ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎక్కువ విస్తరణకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎలక్ట్రానిక్స్ రంగంపై చర్చించారు. ఎలక్ట్రానిక్స్పై ముగింపు చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మరుగుదొడ్లు లేనివారు చాలా మంది ఉన్నారని, కానీ సెల్ఫోన్ లేనివారు కనబడటం లేదన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకంతో చాలా రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి రాష్ట్రం నుంచి ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో ఒక్క ఎలక్ట్రానిక్ పరిశ్రమ లేదని, ఇప్పుడు అందరూ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు వస్తున్నారని పేర్కొన్నారు.