అమరావతి :ప్రత్యేక హోదాతో ఒరిగేదేం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పారు. నాడు ఆయన చెప్పిన మాటనే నేనిన్ని రోజులు చెబుతున్నానని సోము వీర్రాజు అన్నారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడిన ఆయన దేశంలో అందరి కంటే కేంద్రం నుంచి మనమే ఎక్కువ సాధించాం అన్న మాట కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నదేనని ఆయన చెప్పారు. మరి ఇప్పుడు మాట మార్చిన చంద్రబాబును ఎవరూ ఎందుకు ప్రశ్నంచరని అన్నారు.