అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేయాలనే అంశానికి జడ్జీల కమిటీ నో చెప్పింది. జస్టిస్ సిటీలోనే ఆంధ్రా హైకోర్టు నిర్మించాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. తాత్కాలిక హైకోర్టు కోసం పరిశీలించిన బెజవాడ, గుంటూరులలోని ప్రాంతాలు అనువుగా లేవని కమిటీ అభిప్రాయపడింది. హైకోర్టు నిర్మాణం కొంత ఆలస్యమైనా ఆగుతామని కమిటీ పేర్కొంది.