కావలి : వామపక్షాల పిలుపు మేరకు నేడు జరుగుతున్న ఏపీ బంద్ కు మద్దతుగా నేడు తన ప్రజాసంకల్ప యాత్రకు విరామం ప్రకటించిన వైకాపా అధినేత జగన్ విద్యార్థులతో కలిసి బంద్ లో పాల్గొన్నారు. కావలిలో ఆయన విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వల్లనే రాష్ట్రానికి నిధులలో, ప్రాజెక్టులలో వాటా దక్కలేదని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.