ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటులో చర్చ జరగాలి : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 08, 2018, 10:37 AM

దుబాయ్‌ : ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో కచ్చితంగా చర్చ జరగాల్సిందేనని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎంపిలకు సూచించారు. కనీసం రెండునుంచి మూడు గంటలపాటు చర్చ జరగాలని ఆయన అన్నారు. రేపటితో సభ ముగిస్తే అయిపోయిందనుకోవద్దని తిరిగి మార్చి 5 నుంచి పార్లమెంటు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. రాష్ట విభజనకు లేని ఫార్ములా లోటు బడ్జెట్‌ భర్తీ చేయడానికి కావాలా అని  ప్రశ్నించారు. ప్రధాని మోడీ ప్రసంగంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌ కోసం తాము ధర్మ పోరాటం చేస్తున్నామని అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసమే ఉద్యమిస్తున్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేలా చూడటానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలని టిడిపి ఎంపిలకు సూచించారు. దుబాయ్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు అక్కడి నుంచే టిడిపి ఎంపిలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎపికి జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీల వారికి వివరించాలని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com