తాడేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వద్ద శుక్రవారం టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల పిల్లలతో తరగతి గదులు శుభ్రం చేయించడం పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు స్కూల్ ఆవరణను చీపురులతో వూడ్చి తమ నిరసన తెలిపారు. విద్యను చెప్పాల్సిన చోట విద్యార్థులతో చాకిరీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాల ఉపాధ్యాయులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.