జైట్లీ పద్దుపై ఏపీ టీడీపీ నేతలు ఒకవైపు భగ్గుమంటుంటే బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలోని అన్ని రాష్ర్టాలతో సమానంగానే ఏపీని చూస్తామని అన్నారు. రాష్ర్టాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అనడం సరికాదని, అన్ని రాష్ర్టాలకు దక్కే అన్నీ ప్రయోజనాలు ఏపీకి దక్కుతాయని అన్నారు. డీపీఆర్ లేనందునే రాజధాని నిధులు ఇవ్వలేదన్న మాణిక్యాలరావు అన్యాయం జరిగింది అనేది మిత్రపక్షం వాదనకాదు మిత్రపక్షంలోని కొందరి వాదన అని అన్నారు.