త్వరలో కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి టెండర్లు పిలువనున్నట్ల మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆయుష్ శాఖలో ఉన్న ఆస్పత్రులను తక్షణమే బలోపేతం చేయాలన్నారు. ఆయుష్ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలన్నారు. వేసవిలో విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా హోమియో మందులు పంపిణీ చేస్తామన్నారు.