భువనేశ్వర్ : ఒడిశాలోని పూరి - భువనేశ్వర్ రహదారిపై పిప్పిలి వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆటో - లారీ అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.