ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాలు...మరోవైపు పిడుగులతో ప్రజల ప్రాణాలు హరి

national |  Suryaa Desk  | Published : Sun, Aug 07, 2022, 11:35 PM

గతానికి భిన్నంగా ఏ ఏడాది వర్షాలు  దేశ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా వారి ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు ఏకధాటిగా పడుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో వానలతో పాటు పిడుగులు వణిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో పిడుగులు పడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని విదిషా, సత్నా, గుణ జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. భారత వాతావరణ విభాగం ఆదివారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మెరుపులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.


విదిశా జిల్లాలోన అగసోడ్ గ్రామంలో శనివారం సాయంత్రం బోరున వర్షం కురిసింది. వానల్లో తడవకూడదనే ఉద్దేశంతో ఓ చెట్టు కింద నలుగురు తలదాచుకున్నారు. అదే వారికి శాపంగా మారింది. అదే చెట్టుపై పిడుగు పడింది. దాంతో నలుగురు స్పాట్‌లో చనిపోయారు. అయితే ఈ విషాద ఘటన జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోనే జరిగినట్టు సిటీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కున్వర్‌ సింగ్‌ ముకటి వెల్లడించారు. చనిపోయిన వారిని గాలు మాలవ్య, రాము, గుడ్డా, ప్రభులాల్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరంతా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్టు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.


అలాగే సత్నా జిల్లాలో పోడి పటౌరా, జట్వారా ప్రాంతాల్లో శనివారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు బాలురు గాయపడ్డారు. మృతులను అంజన (34), చంద్ర (65), రాజ్‌కుమార్‌ (65), రామ్‌కుమార్‌ యాదవ్‌ (43)గా గుర్తించారు. గాయపడిన 12 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలను ఆస్పత్రిలో చేర్చినట్టు పోలీసులు తెలిపారు. అలాగే మను అహిర్వార్ (45) అనే మహిళ కూడా శనివారం భోరా గ్రామంలో పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే సోమవారం నుంచి మరో మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com