రాజధాని విషయంలో రాష్ట్రప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా "మనం - మన అమరావతి" పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దడానికి బిజెపి కట్టుబడి ఉంది. రాష్ట్రంలో రెండు పార్టీలు రాజధాని అంశంలో విఫలమయ్యాయి. రైతుల సమస్యలను పరిష్కరించి వెంటనే రాజధాని పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అని తెలియజేసారు.