దేశంలో అగ్రవర్ణ కులాల కోసం ప్రత్యేక పథకాన్ని తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వై . ఎస్ . జగన్ మోహన్ రెడ్డి గారిదేనని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సంక్షేమశాఖా మంత్రి ఆర్ . కే . రొజా గారు అన్నారు . శుక్రవారం అవనిగడ్డలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వై . ఎస్ . ఆర్ . కాపు నేస్తం మూడో విడత జిల్లాస్థాయి ప్రారంభ కార్యక్రమం గౌరవ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు . జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి ఆర్ . కే . రొజా , జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా , గౌరవ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబుగార్లతో కలిసి వై . ఎస్ . ఆర్ . కాపు నేస్తం మూడో విడత 21 , 720 లబ్దిదారులకు 32 . 58 కోట్ల రూపాయల నమూనా చెక్కును పంపిణీ గావించారు .