ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్రవర్ణ కులాల కోసం ప్రత్యేక పథకాన్ని తెచ్చిన ఘనత జగన్ దే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 04:21 PM

దేశంలో అగ్రవర్ణ కులాల కోసం ప్రత్యేక పథకాన్ని తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వై . ఎస్ . జగన్ మోహన్ రెడ్డి గారిదేనని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సంక్షేమశాఖా మంత్రి  ఆర్ . కే . రొజా గారు అన్నారు . శుక్రవారం అవనిగడ్డలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వై . ఎస్ . ఆర్ . కాపు నేస్తం మూడో విడత జిల్లాస్థాయి ప్రారంభ కార్యక్రమం గౌరవ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు . జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి ఆర్ . కే . రొజా , జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా , గౌరవ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబుగార్లతో కలిసి  వై . ఎస్ . ఆర్ . కాపు నేస్తం మూడో విడత 21 , 720 లబ్దిదారులకు 32 . 58 కోట్ల రూపాయల నమూనా చెక్కును పంపిణీ గావించారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com