ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ర్యాంకు ఇచ్చింది మీరే.. విమర్శించేది మీరే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 02, 2022, 11:32 AM

పారిశ్రామికరంగంలో కీలక మార్పులు తీసుకొస్తున్న సీఎం జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలి పెడుతున్నామన్నారు మంత్రి గుడివాడ అమర్నాధ్.  ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌  ర్యాంక్ మీద స్పందిస్తూ... చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 60 పరిశ్రమలను అమ్మించింది మీరు కాదా అని బీజేపీ పార్టీ ని  ప్రశ్నించారు. రాష్ట్రా నికి వేలకోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్న సీఎం జగన్‌ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు.  స్టీల్‌ప్లాంట్‌ను మీ ప్రభుత్వం అమ్మాలని చూస్తుంటే ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. ర్యాంకు ఇచ్చిందీ మీరే, విమర్శించేదీ మీరే అని అన్నారు.  2019 తరువాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిందని, బీజేపీకీ ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 175 స్థానాల్లో పోటీచేసీ మళ్లీ డిపాజిట్లు పోగొట్టుకోవాలన్న సరదా ఉంటే అందుకు సిద్ధం కావాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com