కారంచేడు మండలంలోని స్వర్ణ పాలెం గ్రామానికి చెందిన బెల్లం సుబ్బారావు (60), బెల్లం శేషమ్మ (55) అనే రైతు దంపతులు అప్పుల బాధ తాళలేక బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గత రెండు సంవత్సరాల నుండి వ్యవసాయంలో నష్టం రావడంతో మనస్థాపానికి గురై మధ్యాహ్నం పురుగులమందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గమనించి ఇంకొల్లు వైద్యశాలకు తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.