కడప జిల్లాలో జరుగుతున్న శనివారం జాబ్మేళాకు 8364 మంది హాజరైతే దాదాపు 4500 మంది ఎంపిక కావడం జరిగిందని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఒకటి గమనించాం. మీరు 100 శాతం విజయం సాధించాలంటే, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా పెంచుకోవాలి. ఇప్పుడు బాగా లేదని అనడం లేదు. అయితే మీరు చెప్పాలనుకునేది ఇంకా విశ్వాసంతో చెప్పాలి. అప్పుడే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వారికి మీపై నమ్మకం ఏర్పడుతుంది. జాబ్మేళా అనేది నిరంతం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్మేళాలు నిర్వహిస్తాం. నిరుద్యోగ సమస్యను పారదోలాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రం నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలి. ప్రపంచంలో మన వాళ్లు ఎక్కడ పని చేసినా, తమను తాము ప్రూవ్ చేసుకోవాలి. ఒక్క భారత్లోనే కాకుండా, ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా మన విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలి. వాటిలో సక్సెస్ కావాలి అని తెలియజేసారు.