కర్నూలు జిల్లాలోని గ్రామాల్లో ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచాలని డ్వామా పీడీ అమర్నాథరెడ్డి ఉపాధిహామీ అధికారులను ఆదేశించారు. శనివారం వారు కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామం దగ్గర జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. పల్లెలో వ్యవసాయ పనులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పీడీ ఆదేశించారు.