ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్‌లైన్ రమ్మీకి బానిసై వివాహిత ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 04:18 PM

ఆన్‌లైన్ రమ్మీ ఆడి, అప్పులు పెరిగిపోవడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసకుంది. చెన్నైలోని మనాలి న్యూ టౌన్‌కు చెందిన భవాని (29), బక్కియరాజ్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ రమ్మీకి ఆమె బానిస అయింది. ఇందు కోసం బంధువుల నుంచి రూ.3 లక్షల అప్పు చేయడంతో పాటు, తమ 20 సవర్ల బంగారు ఆభరణాలను తనఖా పెట్టిన డబ్బుతో ఆడింది. చివరికి మనోవేదనతో బలవన్మరణానికి ఆదివారం పాల్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com