చంద్రబాబు 2019 ఎన్నికల్లో తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాడని, ప్రజల స్పందన తెలుసుకోకుండా తనసొంత నిర్ణయంతో వెళ్లి ఒటమి చవి చూసారని వైసీపీ నాయకులూ పేర్ని నాని అన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం పై సీఎం జగన్ తో జరిగిన సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియా తో మాట్లాడుతూ... ప్రజల తీర్పును గమనించాలి. ఊహల్లో టీడీపీ నేతలు బతుకుతున్నారు. పార్టీని బతికించుకోవాలనే ఆలోచన టీడీపీకి లేదు. ఎంతసేపు కొడుకు లోకేష్ నాయకత్వాన్ని బతికించాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.