సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమని ఉరవకొండ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం విడపనకల్లు మండలం ఉండబండ వీరభద్రస్వామి ఆలయం వద్ద వైయస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో బస్సు యాత్ర విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 29న అనంతపురంలో జరిగే 'సామాజిక న్యాయ భేరి' సదస్సుకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.