సంజామల మండలం పరిధిలో పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తిమ్మారెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సంజామల మండలంలోని ముదిగేడు గ్రామ సమీపంలోని ముదిగేటమ్మ దేవాలయం వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో వెంటనే సిబ్బందితో వెళ్లి పేకాటాడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 6500 స్వాధీనం చేసుకున్నామ న్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.