కావలసిన పదార్థాలు: బాగా పండిన మామిడి పండ్లు - 3, పచ్చి మామిడి కాయ -1, పంచదార - 2 కప్పులు, ఉప్పు - కొద్దిగా, ఐస్ క్యూబ్స్ -4
తయారీవిధానం: ముందుగా మామిడి పండ్లకున్న పై చెక్కును తీసేసి చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలను ఒక కుక్కర్ లోకి తీసుకుని అందులో రెండు కప్పుల పంచదారను, కొద్దిగా ఉప్పును, ఒక కప్పు వాటర్ ను పోసి మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న మామిడికాయ ముక్కలను జ్యూసర్ లోకి తీసుకుని దానికి కొన్ని ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే ఈ మిశ్రమానికి చల్లటి నీళ్లను యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడా పీచు, ముక్కలు లేకుండా ఉండేలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఇలా చెయ్యటం వల్ల జ్యూస్ లో ఏమైనా ఉండలు, పీచు లాంటివి ఉంటే ఈజీగా తీసెయ్యొచ్చు. ఆ తర్వాత మిశ్రమం థిక్ నెస్ ను బట్టి అందులో నీళ్లను కలపండి. మీ రుచికి తగ్గట్టు అందులో పంచదారను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని బాగా చల్లబడిన తర్వాత గ్లాసులో పోసుకుని తాగితే అచ్చు ఫ్రూటీ తగినట్టే ఉంటుంది. ఈ జ్యూస్ ను పిల్లలకు ఇస్తే ఎంతో ఇష్టంగా తాగుతారు.