ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు జిల్లాలో విషాదం....ఈత కొడుతు నలుగురు చిన్నారులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 10:12 PM

ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కర్నూలులోని ఆలంకొండలో నలుగురు చిన్నారులు పొలంలోని బావిలో దిగారు. ఆ సమయంలో ఈత కొడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ మోటారు వైర్లు తగిలాయి. విద్యుత్ షాక్‌తో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సాయికుమార్, కార్తీక్, రాజేష్, కమల్ బాషాగా గుర్తించారు. నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com