ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కర్నూలులోని ఆలంకొండలో నలుగురు చిన్నారులు పొలంలోని బావిలో దిగారు. ఆ సమయంలో ఈత కొడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ మోటారు వైర్లు తగిలాయి. విద్యుత్ షాక్తో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సాయికుమార్, కార్తీక్, రాజేష్, కమల్ బాషాగా గుర్తించారు. నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.