ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 01:28 PM

అనంతపురం: గుంతకల్లు పట్టణంలోని ఇందిరాగాంధీ నగర్ భాష్యం స్కూలు సమీపంలో నివసిస్తున్న భీమలింగ(52)బుధవారం రాత్రి సత్యనారాయణ పేట భవాని గుడి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.


అతని భార్య గౌరమ్మ ఆర్టీసి కండక్టర్ గా పనిచేస్తోంది. ఎంతో కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న అతడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జిఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com