ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ఫలితాలపై రెండు రోజుల్లో స్పందిస్తా: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 06:00 PM

పరిషత్ ఎన్నికల్లో జనసేన విజేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల మేరకు 177 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలను జనసేన అభ్యర్ధులు గెలిచారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తమ దగ్గర ఉందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తానని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com