ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొప్పాయి, పాలతో ముడతలకు చెక్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 03, 2021, 03:55 PM

అమ్మాయిలు అందంగా కనిపించేందుకు ఏవోవో ప్రొడక్టులు ట్రై చేస్తుంటారు. ఫేస్ క్రీములనీ, ఫేస్ ప్యాక్‌లనీ ఇలా ఎన్నో కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇంట్లో ఉండే సామాగ్రితోనే ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. పసుపు, పెరుగుతోనే మొహం నిగారింపును పెంచుకోవచ్చు.


గుడ్డు హెయిర్ పెరుగుదలలో మంచి పాత్ర పోషిస్తుంది. కోడిగుడ్డు తెల్లసొనలో కాస్త ఆలివ్‌ నూనె, చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి.. దాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించి అరగంటయ్యాక కడిగేస్తే చాలు. పోషణ అందుతుంది. వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది.అదే విధంగా రెండు కప్పుల ఉసిరిపొడిలో కప్పు పెరుగు, అరచెక్క నిమ్మరసం కలిపి తలకు ప్యాక్‌ వేస్తే వెంట్రుకలు మృదువుగా మారతాయి. దాంతో పాటు చుండ్రు సమస్య తగ్గుతుంది.


బయటకు వెళ్లి వచ్చి.. బొప్పాయి గుజ్జులో కొన్ని పాలు కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే చర్మానికి ఉపశమనం కలుగుతుంది. ముడతలు రావు. అలాగే నిమ్మరసంలో చిటికెడు పసుపు వేసి ముఖానికి రాస్తే జిడ్డుతత్వం తగ్గి చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.


అరకప్పు నువ్వుల నూనెలో గుప్పెడు గులాబీ రేకలు, చెంచా మెంతులు వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని ఒంటికి నలుగులా రాసి మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చర్మ ఛాయ మెరుగుపడుతుంది. అదేవిధంగా పావు కప్పు బాదం ముద్దకు కొద్దిగా వట్టివేళ్ల పొడి, చెంచా కస్తూరి పసుపు, రెండు చెంచాల అముదం కలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని మెడ, చేతులు, ముఖానికి రాసి చేతుల్ని నీళ్లతో తడుపుతూ మృదువుగా మర్దన చేయాలి. ఇలా చూస్తే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com