ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్తగా 1,186 కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 01, 2021, 05:02 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 56,155 సాంపిల్స్ ని పరీక్షించగా 1,186 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో 1,396 మంది కరోనా నుంచి కోలుకోగా 10 మంది కరోనాతో మృతిచెందారు. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 20,12,407 పాజిటివ్ కేసులకు గాను ఇప్పటివరకు 19,84,067 మంది డిశ్చార్జ్ కాగా 13,867 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,473 గా ఉంది.


గత 24 గంటల్లో కరోనాతో కృష్ణ జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.


గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసులు..


అనంతపూర్ 40, చిత్తూరు 171, తూర్పు గోదావరి 175, గుంటూరు 111, వైఎస్ఆర్ కడప 87, కృష్ణ 103, కర్నూల్ 13, నెల్లూరు 156, ప్రకాశం 125, శ్రీకాకుళం 50, విశాఖ పట్నం 69, విజయనగరం 13, పశ్చిమ గోదావరి 73.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com