గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద సిబ్బంది బందోబస్తు ను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల పర్యటన అనంతరం తిరిగి రానున్న సందర్భంగా బందోబస్తు ఏర్పాటు పరిశీలించారు. సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. హై సెక్యూరిటీ జోన్ పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సిబ్బందికి పలు సూచనలు చేశారు.