గుంటూరు జిల్లా తెనాలి బస్టాండ్ సమీపంలో ప్యారాడైజ్ అపార్ట్మెంట్ లో జరిగిన మహిళ హత్య కేసును టు టౌన్ పోలీసులు చేధించారు. మంగళవారం హత్యకు సంబంధించిన వివరాలను తెనాలి డిఎస్పి స్రవంతి రాయి మీడియాకు వివరించారు. అత్త కోడలు మధ్య జరిగిన వాగ్వాదంలో అత్త మైదిలి నిద్రిస్తుండగా కోడలు రాధ ప్రియాంక కూరగాయలు కోసే కత్తి తో పొడిచి, చపాతి కర్ర తో కొట్టి చంపినట్టు పోలీసులు ధ్రువీకరించారు. కోడలు రాధ ప్రియాంకను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు డిఎస్పి స్రవంతి రాయ్ తెలిపారు.