న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అతనికి గుండె ఆపరేషన్ చేస్తున్న సమయంలో స్ట్రోక్ వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కెయిన్స్ కాళ్లకు పక్షవాతం వచ్చినట్లు వెల్లడించారు. అతడిని సర్జరీ కోసం సిడ్నీకి తరలించారు. అక్కడ అత్యవసరంగా సర్జరీ నిర్వహించినా కాళ్లకు పక్షవాతం రావడంతో కెయిన్స్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు.
కాళ్లు చచ్చుబడిపోవడంతో ఆస్ట్రేలియాలోనే మరో ఆస్పత్రిలో కెయిన్స్కు రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. సిడ్నీలో సర్జరీ తర్వాత కెయిన్స్ను కుటుంబ సభ్యులు మళ్లీ కాన్బెరాకు తీసుకొచ్చారు. న్యూజిలాండ్ తరఫున కెయిన్స్ 1989 నుంచి 2004 మధ్య 62 టెస్టులు ఆడాడు.