గుంటూరులో బీటెక్ విద్యార్థిని ప్రమోన్మాది అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరిచిపోకముందే మరో దారుణం చోటు చేసుకుంది. గుంటూరులోని రేయిపూడిలో నివాసం ఉంటున్న ఓ దంపతులకు చెందిన బాలిక తమ కుటుంబ సభ్యులతో కలిసి రాజుపాలెంలో బంధువు చనిపోవడంతో కార్యక్రమానికి వెళ్లింది. అయితే అక్కడ ఒంటరిగా ఉన్న ఆ బాలికపై కొందరి కామాందుల కన్ను పడింది. ఓ ఇద్దరు ఆమె దగ్గరకు వెళ్లి అమ్మ పిలుస్తోందని చెప్పి నమ్మించారు. నిజమే అని నమ్మిన ఆ బాలిక వారితో పాటు ఇంటి వెనుకకు వెళ్తున్న సమయంలో ఆమె నోటిలో గుడ్డలు కుక్కి మరో ఇంట్లోకి తీసుకెళ్లి నిర్బంధించారు. నాలుగు గంటల పాటు నిర్భిందించి ఆమెపై తమ కోరికలు తీర్చుకున్నారు. తరువాత విడిచిపెట్టారు. అత్యంత దారుణంగా హింసించారు. వారి చెర నుంచి బయటకు వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. యువతి చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించి కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.