సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు తెలివిమీరుతున్నారు. తాజాగా చిన్నపాటి పెట్టుబడితో లక్షల్లో లాభాలు ఆర్జించవచ్చని అమాయకులకు గాలం వేస్తున్నారు. తక్కువ కాలంలో లక్షాధికారులు కావొచ్చని అబద్దాలు ఊదరగొడుతూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటి ప్రకటనతో అమాయకులను మోసం చేస్తున్న యాప్స్ పట్ల సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిక చేశారు. డేబెట్, అమెజాన్93.కామ్, ఈబే19.కామ్, లక్కీబాల్, ఈజెడ్ప్లాన్, సన్ఫ్యాక్టరీ.ఈటీసీ లాంటి యాప్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వీటి జోలికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఈ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి ఇప్పటికే పలువురు మోసపోయినట్లు తెలిపారు. సో బీకేర్ ఫుల్.