‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద మొదటి విడతలోని 15.10 లక్షల నిర్మాణాల్లో 1.29 లక్షల గృహాల విషయంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అనర్హులు, చనిపోయినవారు, ఇంటి నిర్మాణానికి సమ్మతి తెలపనివారివి, వలస వెళ్లినవారివి, కోర్టు కేసులున్న ఇళ్లను మొదటి విడతలో నుండి మినహాయించింది. వీటి స్థానంలో సొంత స్థలం ఉన్న వారికి, 2వ విడతలో ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి ఉన్నవారికి అవకాశం కల్పించింది. లబ్దిదారులల్లో భర్త లేదా భార్య పేరున ఇది వరకే గృహ నిర్మాణ శాఖ పథకాల్లో ఇల్లు మంజూరైతే వారికి ప్రస్తుతం కేటాయించిన ఇల్లును రద్దు చేసింది. ఇలా మొదటి విడతలో 25 వేల మందిని అనర్హులుగా తేల్చింది.