లార్డ్స్ టెస్టులో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో సిరాజ్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్లో నాలుగు, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీయడం విశేషం. లార్డ్స్ టెస్టులో ఒక టీమిండియా బౌలర్ ఇన్ని వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి. 1982లో కపిల్ దేవ్ తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి ఓవరాల్గా 8 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత ఆ ఘనత సాధించింది మన హైదరాబాదీనే.