జిల్లాలోని కొల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన గ్రావెల్ చిప్స్ లారీ బొల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కొల్లూరు ఎస్టీ కాలనీకి చెందిన వీరంకి దాసు, జట్టి దినేష్గా పోలీసులు గుర్తించారు.