ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాలలో కరోనా కలకలం.. భయాందోళనలో జనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 12, 2021, 03:59 PM

నంద్యాలలో రోజు రోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కేసుల కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా ప్రజల నిర్లక్ష్యంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. దాదాపు 40 రోజుల్లో 2వేలకు పైగా కేసులు నమోదు కావడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో కర్ఫ్యూ సడలింపు సమయంలో జనాలు విచ్చలవిడిగా రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల్లో రంజాన్ పండగ ఉండడం, కర్ఫ్యూ సడలింపు సమయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండడంతో రద్దీ నెలకొంది. సామాజిక దూరం పాటించకుండా జనం రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com