నందిగామ మండలంలో జొన్నలగడ్డ గ్రామం వద్ద కారు బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణం చేసే వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తీవ్రగాయాలు అయిన వ్యక్తిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వ్యక్తి పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామానికి చెందిన సుబ్బయ్య గా గుర్తించారు. కారు అతి వేగంగా మధిర నుంచి వస్తూ బైక్ ని ఢీకొన్నడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.