కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది తమ వారిని కోల్పోతున్నారు. తాజాగా ఓ మహిళ తండ్రి కరోనాతో చనిపోయాడు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక పోయిన ఆ మహిళ తన తండ్రి చితి మంటల్లో దూకింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. బార్మెర్ లోని రాయ్ కాలనీలో నివసించే దామోదర్ దాస్ శర్గా కరోనాతో మృతిచెందారు. ఆయన భార్య కొంత కాలం కిందట చనిపోయింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో 34 ఏళ్ల అవివాహిత అయిన చిన్న కుమార్తె చంద్ర శర్ధా.. తన తండ్రి చనిపోయాడనే వార్తను జీర్ణించుకోలేకపోయింది. దీంతో తండ్రి చితి మంటల్లోనే దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె శరీరం 70 శాతం కాలిపోయిందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.