ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వంపై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్ లో ధాఖలు చేసిన దానికి, క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కరోనా విధానాలకు పొంతనలేదని, బెడ్లు దొరకడం లేదని నోడల్ అధికారులే బదులివ్వడం ఏంటని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పద్ధతి మార్చుకోకుంటే సీఎస్ అఫిడవిట్ ధాఖలు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది.