డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిఎంకె శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన ఆయన రాజ్భవన్లో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ను బుధవారం కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. డిఎంకె శాసనసభా పక్ష నేతగా తనను ఎన్నుకున్న లేఖను గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆయనను ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం 9గంటలకు రాజ్భవన్లో సిఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం జరుగుతుందని రాజ్భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించి అధికార సమాచారాన్ని గవర్నర్ కార్యదర్శి ఆనంద్రావు విష్ణు పాటిల్ అంతకు ముందు స్టాలిన్ నివాసానికి వచ్చి అందజేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.