కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్(82) కరోనాతో కన్నుమూశారు. గురుగ్రామ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గత నెల 20న ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు. అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని బాఘ్ పట్ లోక్ సభ నుంచి 7 సార్లు గెలిచారు. 1986 లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.