ఏపీ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మే 5 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు ఉంటాయని అన్నారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈసారి రాష్ట్రంలో పదిన్నర లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల పరీక్షల నిర్వహణకు 1400లకు పైగా ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇక ఒక్కో ఎగ్జామ్ సెంటర్ వద్ద ఒక్కో ప్రోటోకాల్ అధికారిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షా సెంటర్కు వచ్చే ఏ విద్యార్థికైనా కోవిడ్ లక్షణాలుంటే.. వారి కోసం ప్రత్యేక గదుల్ని కేటాయించినట్లు తెలిపారు. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి సెంటర్లో థర్మల్స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.