భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన కరోనా ఒక్కసారిగా విజృంభిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. న్యూఢిల్లీలో గత 24 గంటల్లో 24 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ట్రేడర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం కేజ్రివాల్ కు వారు లేఖ రాశారు. అందులో ఏమని పలు సూచనలు చేశారు. అందులో ఏమని పేర్కొన్నారంటే.. “కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. ఈ వేవ్ ను అడ్డుకోవాలంటే కనీసం 15 రోజులు లాక్ డౌన్ ను విధించాలి. ఢిల్లీకి చేరుకునే అన్ని మార్గాలను మూసేయాలి. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలను కఠినం చేయాలి.” అని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ లేఖలో కోరింది.