తమిళనాడులో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కరోనా కట్టడికై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి వేళల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజా రవాణా, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలను అనుమతించరు. ప్రతి ఆదివారం ఆ రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేయనున్నారు. నిత్యవసరాల షాపులు, మెడికల్ షాపులు మాత్రమే తెరిచేందుకు అనుమతినిస్తారు. రెస్టారెంట్లు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటలు మాత్రమే పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 12వ తరగతి బోర్డు పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పటికే టెన్త్,ఇంటర్ విద్యార్దులందరిని పాస్ చేసిన విషయం తెలిసిందే.