ఏపీలో కరోనా వైరస్ ప్రమాదకర రీతిలో వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,228 మంది కరోనా బారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే వైరస్ భారిన పడి 10 మంది మరణించారు. మరణించిన వారిలో చిత్తూర్ లో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, కృష్ణ, కర్నూల్, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 9,32,892 కు చేరింది. ఏపీలో మరణాల సంఖ్య 7,321కి చేరుకుంది.