విజయవాడలో తుపాకీ మిస్ ఫైర్ అయ్యి హోంగార్డు భార్య మృతి చెందిన కేసులో ట్విస్ట్ బయటపడింది. తాకట్టు పెట్టిన బంగారం విడిపించే విషయంలో గొడవ జరగడంతో హోంగార్డు వినోద్.. తన భార్యను కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో గన్ మిస్ఫైర్ అయ్యిందని వినోద్ మొదట నాటకం ఆడాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. వినోద్ భార్య రత్నప్రభ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ. వారిది ప్రేమ వివాహం.