అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం యోగిఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ మంత్రివర్గం అయోధ్య వినామాశ్రయానికి మర్యాద పురుషోత్తం శ్రీరామ్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడం పట్ల సాధువులు హర్షం వ్యక్తం చేశారు. అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత విమానాశ్రయ నిర్మాణ పనులు మొదలవుతాయి. అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని గతంలోనే యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా, యూపీలో ఈ ఏడాది రైతులు చెల్లించే మండీ ఫీజును 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ కూడా యూపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.