ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియురాలి ముఖంపై శానిటైజర్ తో దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 08:33 PM

డబ్బులివ్వలేదన్న కోపంతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై ఘాతుకానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఆమె ముఖంపై శానిటైజర్‌ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఆమె కేకలు పెట్టడంతో స్థానికులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. చండీగఢ్‌కి చెందిన నరేష్, షిల్లాంగ్‌కి చెందిన రవళి(22) (పేరు మార్చాం) కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో దామిని చండీగఢ్ వచ్చింది. అప్పటి నుంచి ప్రియుడు నరేష్‌తో కలసి ఉంటోంది. ఈ నెల ఆరో తేదీ అర్ధరాత్రి సమయంలో తనకు రూ.2 వేలు కావాలని నరేష్ ప్రియురాలితో గొడవపడ్డాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో కోపంతో ఊగిపోతూ అమానుషానికి పాల్పడ్డాడు.ఆమె ముఖంపై శానిటైజర్ పోసి లైటర్‌తో నిప్పంటించాడు. శానిటైజర్ మండి ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో బాధితురాలు పెద్దగా కేకలు వేస్తూ బయటికి రావడంతో స్థానికులు అప్రమత్తమై ఆమెను ఆస్పత్రికి తరలించారు. 20 శాతం కాలిన గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను గతంలోనూ డబ్బుల కోసం కొట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com