ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నీలో రాళ్ల సమస్య అధిగమించడానికి ఈ ఫుడ్ తినండి...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 07:41 PM

శరీరంలోని ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌లో కిడ్నీలు కూడా ఉంటాయి. అవి సరిగ్గా పని చేయగలిగితేనే మనం సరిగ్గా పని చేయగలుగుతాం. కిఏ కారణం చేతనైనా కిడ్నీలు సరిగా పని చేయకపోతే, అక్కర్లేని వాటిని బయటికి పంపించలేకపోతే కిడ్నీల్లో క్రిస్టల్స్ ఏర్పడుతాయి. వాటినే కిడ్నీల్లో రాళ్ళు అంటూంటాం. కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ రాళ్ల సమస్యను అధిగమించవచ్చు. అవేంటో చూద్దాం...యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ని కరిగించేందుకు సహాయపడుతుంది. బ్లడ్ లోనూ, యూరిన్ లోనూ ఉన్న యాసిడ్ ని తగ్గించి స్టోన్స్ మళ్ళీ ఏర్పడకుండా చూస్తుంది.దానిమ్మల్లో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. కిడ్నీలలో ఏర్పడే క్రిస్టల్స్ ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది. డాండలియన్ టీ కిడ్నీలని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఈ టీ కిడ్నీలకి టానిక్ లాగా కూడా పని చేస్తుంది.తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలని శుభ్రపరచి, కిడ్నీలోని రాళ్ళని కరిగేలా చేస్తాయి. కిడ్నీలు స్ట్రాంగ్ గా తయారౌతాయి. ఇందులో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కిడ్నీ లోని రాళ్ళు చిన్న చిన్న ముక్కలు గా విడిపోయి యూరిన్ ద్వారా బైటికి పోయేలా చేస్తుంది.లెమన్స్ లో ఉన్న సిట్రేట్ వలన కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి, ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్ళు స్మూత్ గా బైటికి వెళ్ళిపోతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com