రూ. 3 వేల అప్పు చెల్లించలేదని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనే ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం నాగులదేవుపాడుకు చెందిన గుజ్జుల సందీప్ ఆటోడ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెంకు చెందిన జానపూడి అనూషతో వివాహేతర సంబంధం ఉంది. కొద్దిరోజుల క్రితం అనూషకు డబ్బులు అవసరం కావడంతో వారం రోజుల్లో తిరిగి ఇస్తానంటూ రూ.3 వేలు అప్పుగా తీసుకుంది. అనంతరం సందీప్ డబ్బులు అడుగుతూ ఉండగా ఆమె ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటోంది. ఈ నేపథ్యంలో జూలై 1న మధ్యాహ్నం 12 గంటలకు అనూష ఫోన్ చేసి సందీప్ను 7వ మైలు దగ్గరకు రమ్మని చెప్పటంతో అతను ఆటో వేసుకుని అక్కడికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఆటోలో మొండూరు వద్ద పోలవరం కుడికాలువ గ్రావెల్ రోడ్డులోకి వెళ్ళి ఆటోను పక్కగా పెట్టి మట్టిదిబ్బల వద్దకు వెళ్ళారు. ఇద్దరూ అక్కడ కొద్దిసేపు గడిపారు. అనంతరం సందీప్ ఆమెను డబ్బులు గురించి అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సందీప్ కోపంతో అనూషను గట్టిగా కొట్టాడు.అనూష మెడలోని చున్నీతో బలంగా లాడి ముడివేశాడు. దీంతో అనూష చనిపోవడంతో ఆమె మొబైల్ ఫోను, ఆధార్కార్డు, రేషన్కార్డు, ఓటర్ కార్డు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈ కేసును చేధించిన పోలీసులు నిందితుడు సందీప్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.