కరోనా నేపథ్యంలో పాన్-ఆధార్ కార్డుల లింకు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా సార్లు ఈ గడువును పొడగించిన కేంద్రం.. తాజాగా మరోసారి గడువు పెంచుతున్నట్లు తెలిపింది. గతంలో ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 31 వరకు పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో కచ్చితంగా అనుసంధానం చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఒక వేళ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీశాఖ ఏప్రిల్ లో ప్రకటించింది.